భీకర ఎన్‌కౌంటర్.. మరో నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం పొర్చెలి అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

Update: 2024-04-02 03:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం పొర్చెలి అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. పలువురికి గాయాలు అయినట్లు సమాచారం. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతాబలగాలకు, మావోయిస్టులు తారసపడ్డట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. మరణించిన మావోయిస్టు మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనా స్థలం వద్ద మందుపాతరలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.

Tags:    

Similar News