మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, కొడుకు మృతి

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని మాటేడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది.

Update: 2024-04-20 13:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని మాటేడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న తండ్రి, కొడుకు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను చిన్నగూడూరు మండలం గుండమరాజుపల్లె వాసులుగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News