పిడుగుపాటుకు రైతు మృతి

పిడుగుపాటుకు రైతు మృతి చెందిన సంఘటన ములకలపల్లి మండలం పూసగూడెం పంచాయతీ ఒడ్డు రామవరం గ్రామంలో చోటుచేసుకుంది.

Update: 2024-05-03 13:39 GMT

దిశ, ములకలపల్లి : పిడుగుపాటుకు రైతు మృతి చెందిన సంఘటన ములకలపల్లి మండలం పూసగూడెం పంచాయతీ ఒడ్డు రామవరం గ్రామంలో చోటుచేసుకుంది. గత పది రోజుల క్రితం వరి ధాన్యం కోసి రైతులు కళ్లాల్లో ఆరబోశారు. పది రోజులుగా వరి కళ్లాల దగ్గర కాపలా ఉంటున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో అకాల వర్షానికి పిడుగు పడడంతో బోడ శివరాం (40) అక్కడికక్కడే మృతి చెందగా మరో రైతు గుగులోతు శ్రీను తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడికి భార్య అనిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 


Similar News