మంటలు అంటుకొని రైతు మృతి

వరి కోతల తరువాత మిగిలిన వరి కొయ్యలకు, గడ్డికి నిప్పు పెట్టిన రైతు అవే మంటలు అంటుకుని మృతి చెందాడు.

Update: 2024-05-03 15:51 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : వరి కోతల తరువాత మిగిలిన వరి కొయ్యలకు, గడ్డికి నిప్పు పెట్టిన రైతు అవే మంటలు అంటుకుని మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పోత్నూర్ గ్రామ శివారులో జరిగింది. పెద్ధ వాల్గోట్ గ్రామానికి చెందిన లడాయి శంకర్ (58) ఇటీవల తన పొలంలో మెషిన్ తో వరి పంట కోతలను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఎండాకాలంలోనే వరి మడుల దున్నకానికి సిద్ధం చేసేందుకు గాను శుక్రవారం ఉదయం వరి కొయ్యలకు నిప్పు పెట్టాడు. దాంతో దట్టమైన పొగ ఆవరించి అక్కడే మంటల్లో చిక్కుకొని మరణించాడు. ఈ మేరకు సిరికొండ పోలీస్ లు కేసు నమోదు చేశారు. 


Similar News