అమానుషం.. చెరువులో మగ పసికందు మృతదేహం

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపుర్

Update: 2024-04-15 12:37 GMT

దిశ, భీమదేవరపల్లి ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపుర్ చెరువులో సోమవారం రోజున పసికందు మృతదేహం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం రోజు వయసున్న మగ శిశువు మృతదేహం చెరువు పక్కన కనిపించిందని బాధ్యులు ఎవరో కానీ ఆ దృశ్యం ప్రతి వ్యక్తిని కంటతడి పెట్టించింది. ఎక్కడైనా వదిలేసి వెళ్లిన గాని ఎవరైనా పెంచుకుంటారు అనేటువంటి అభిప్రాయం ప్రజలు వ్యక్తం చేశారు. మాటలు రాని ఆ పసికందు మృతదేహం ఎన్నో ప్రశ్నలను ప్రజానీకానికి స్పందించింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపడుతున్నట్లు అలాగే ఈ మృతదేహాన్ని ఎంజీఎం కు తరలించినట్లు ఎస్సై రాజుకుమార్ వివరాలు తెలిపారు.

Similar News