BREAKING: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో లారీ బీభత్సం.. ఒకరు దుర్మరణం, ఇద్దరి పరిస్థితి విషమం

లారీ బీభత్సం సృష్టించి ఒకరు దుర్మరణం పాలైన ఘటన రంగారెడ్డి జిల్లా పెద్దషాపూర్ జాతీయ రహదారిపై ఇవాళ చోటుచేసుకుంది.

Update: 2024-03-23 10:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: లారీ బీభత్సం సృష్టించి ఒకరు దుర్మరణం పాలైన ఘటన రంగారెడ్డి జిల్లా పెద్దషాపూర్ జాతీయ రహదారిపై ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శంషాబాద్ మండల పరిధిలోని పెద్దషాపూర్ గ్రామ శివారులో ఓ లారీ అతివేగంతో ఆటో, కారును ఢీకొట్టింది. అనంతరం అదే లారీ సమీపంలోని బస్టాప్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేని దర్యాప్తు చేపట్టనున్నారు.     

Tags:    

Similar News