మురికి కాలువలో ఆడ శిశువు మృతదేహం లభ్యం..

గుర్తుతెలియని అప్పుడే పుట్టి చనిపోయిన ఆడ శిశువు మృతదేహం

Update: 2024-05-10 12:43 GMT

దిశ,హుజురాబాద్ రూరల్: గుర్తుతెలియని అప్పుడే పుట్టి చనిపోయిన ఆడ శిశువు మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన హుజురాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని మరుగుదొడ్ల పక్కన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ...శుక్రవారం హుజురాబాద్ పట్టణ ఆర్టీసీ బస్టాండ్ మరుగుదొడ్ల పక్కన మురికి కాలువ చెత్త కుప్ప చాటున మహిళ శిశువు మృతదేహం కనిపించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... అటు పక్కన వెళుతున్న కొందరు అప్పుడే పుట్టి మృతి చెందిన ఆడ శిశువును గమనించారు. అప్పటికే శిశువు మృతి చెందినట్లు గుర్తించారు.

వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని శిశువు మృతదేహాన్ని పరిశీలించి ఘటన స్థలం వద్ద వివరాలు సేకరించారు. శిశువు మృతదేహం ఎక్కడి నుంచి అయినా తెచ్చి ఇక్కడ పడవేశారా..?ఆడపిల్లని ఆ తల్లి బంధం తెంచుకుందా.. అక్రమ సంతానమా.. అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. శిశువు మృతదేహాన్ని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News