భద్రాచలం ఆలయం ఆఫీసులో మృతదేహం కలకలం

భద్రాద్రి ఆలయ కార్యాలయంలో మృతదేహం కలకలం సృష్టించింది.

Update: 2024-03-26 07:52 GMT

దిశ, భద్రాచలం టౌన్ : భద్రాద్రి ఆలయ కార్యాలయంలో మృతదేహం కలకలం సృష్టించింది. రామాలయానికి చెందిన సీఆర్ఓ కార్యాలయం పై అంతస్తులోని బాత్రూంలో మృతదేహాన్ని ఆఫీసు సిబ్బంది మంగళవారం ఉదయం గుర్తించారు. మృతుడు ఖమ్మం పట్టణానికి చెందిన జాఫర్‌ అని, ఆయన రామాలయం ఆధ్వర్యంలో కొత్తగా నిర్మిస్తున్న వసతి భవనాల్లో టైల్స్ వేసే పనికి వచ్చినట్టు చెబుతున్నారు. కార్యాలయ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News