భద్రాచలం ఎమ్మెల్యే డబ్బు మాయం.. రూ.12 వేలు కొట్టేసిన పిక్ పాకెటర్స్

తెలంగాణ భవన్‌లో కొందరు కేటుగాళ్లు చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. పార్లమెంట్ సన్నాహాక సమావేశాలకు హాజరవుతున్న నాయకులు, కారకర్తల జేబులను పిక్ పాకెటర్లు గుల్లా చేస్తున్నారు.

Update: 2024-01-11 13:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ భవన్‌లో కొందరు కేటుగాళ్లు చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. పార్లమెంట్ సన్నాహాక సమావేశాలకు హాజరవుతున్న నాయకులు, కారకర్తల జేబులను పిక్ పాకెటర్లు గుల్లా చేస్తున్నారు. ఇవాళ నిర్వహించిన మహబూబాబాద్ పార్లమెంట్ సమావేశానికి హాజరైన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భోజన చేసేందుకు కార్యకర్తలతో వెళ్తున్న సమయంలో కేటుగాళ్లు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఆయన జేబులో ఉన్న రూ.12 వేలను కొట్టేసినట్లు సమాచారం. అదే విధంగా భద్రాచలానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మొబైల్ ఫోన్, మరో కార్యకర్తకు చెందిన రూ.42 వేలను కొట్టేశారు. దీంతో సమావేశానికి రావాలంటేనే కేడర్ జంకుతున్నారు. సమావేశానికి హాజరైన కార్యకర్తల డబ్బు ప్రతి రోజూ పోతుండటం విషయం కాస్త హాట్ టాపిక్‌గా మారింది. 

Tags:    

Similar News