వరద కాలువలో గుర్తు తెలియని శవం లభ్యం

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ శివారులో గల

Update: 2024-03-28 11:29 GMT

దిశ, మేడిపల్లి: జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ శివారులో గల ఎస్సారెస్పీ వరద కాలువ లో గుర్తు తెలియని శవం కొట్టుకువచ్చింది. కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహం మగ వ్యక్తిది కాగా సుమారు 40 సంవత్సరాల వయసు ఉన్నట్లుగా గుర్తించారు. కెనాల్ లో డెడ్ బాడీ కొట్టుకు వచ్చినట్లు సమాచారం అందడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే చనిపోయిన వ్యక్తి ఎవరు? ఆత్మహత్యకు పాల్పడ్డాడా, ప్రమాదవశాత్తు జారి పడ్డాడా లేక ఎవరైనా హత్య చేసి కాలువలో పడేసారా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Similar News