మనస్థాపంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

మండల కేంద్రంలోని చిట్యాల గ్రామానికి చెందిన ఈదురు ప్రవళిక

Update: 2024-04-25 08:45 GMT

దిశ,పెద్దవంగర : మండల కేంద్రంలోని చిట్యాల గ్రామానికి చెందిన ఈదురు ప్రవళిక (16) గురువారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు. ప్రవళిక మహబూబాబాద్ జిల్లాలోని సోషల్ వెల్ఫేర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. నిన్న వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి గురువారం ఉదయం ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రవళిక తండ్రి రాంనర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ పేర్కొన్నారు.

Similar News