కొయ్యలగూడెం ఎస్వీ ల్యాబ్లో ప్రమాదం.. ఒకరు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా కొయ్యలగూడెంలో ఉన్న ఎస్వీ ల్యాబ్స్లో ప్రమాదం చోటు చేసుకుంది.
దిశ, వెబ్ డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా కొయ్యలగూడెంలో ఉన్న ఎస్వీ ల్యాబ్స్లో ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలో రియాక్టర్ వద్ద లీకేజీ అయింది. దీంతో ప్లాంట్ ఇన్ ఛార్జ్ నాగరాజు (34) అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. అలాగే మరో ఇద్దరు ఆస్వస్థత గురికాగా.. వారిని హుటాహుటిన హైదరాబాద్ లోని ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.