అడవి పందులు అడ్డు రావడంతో కిందపడి యువకుడు మృతి

లింగంపేట్ మండలంలోని ముస్తాపూర్ గ్రామ శివారులో గత గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు.

Update: 2024-05-07 09:12 GMT

దిశ, లింగంపేట్ : లింగంపేట్ మండలంలోని ముస్తాపూర్ గ్రామ శివారులో గత గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామానికి చెందిన జగదీష్ తన స్నేహితుడు విజయ్ తో కలిసి గత గురువారం కామారెడ్డి నుండి కళ్యాణికి వస్తుండగా ముస్తాపూర్

     గ్రామ శివారులో ప్రమాదం సంభవించినట్లు తెలిపారు. రాత్రిపూట వీరు ప్రయాణిస్తున్న వాహనానికి అడవి పందులు ఎదురుగా రావడంతో అదుపుతప్పి పడిపోయినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో జగదీష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నట్లు తెలిపారు. జగదీష్ కు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య 7 నెలల కూతురు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.  

Similar News