భద్రాద్రిలో దారుణం.. ప్రియుడ్ని కిరాతకంగా చంపిన మహిళ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడ్ని ఓ మహిళ కిరాతకంగా హత్య చేసింది. ఈ ఘటన జిల్లాలోని ఇల్లందు మండలం వజ్జావారి గూడెంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

Update: 2024-05-02 11:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడ్ని ఓ మహిళ కిరాతకంగా హత్య చేసింది. ఈ ఘటన జిల్లాలోని ఇల్లందు మండలం వజ్జావారి గూడెంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అయితే, గతకొంత కాలంగా వారిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటిహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి పేరు శ్రీను, నిందితురాలి పేరు సునీతగా గుర్తించారు. మద్యం మత్తులో ఉన్న శ్రీనుకు ఉరి వేసి చంపినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం సునీతను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తు్న్నారు. కేసు నమోదు చేసుకొని దర్యా్ప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News