పిడుగుపడి వ్యక్తి మృతి

పిడుగుపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన సిద్ధిపేట జిల్లా కుకునూర్ పల్లి మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది.

Update: 2024-05-07 09:21 GMT

దిశ, కొండపాక : పిడుగుపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన సిద్ధిపేట జిల్లా కుకునూర్ పల్లి మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. కుకునూర్ పల్లి ఎస్ఐ పి.శ్రీనివాస్ కథనం మేరకు కుకునూర్ పల్లి మండల కేంద్రానికి చెందిన కుమ్మరి మల్లేశం(33) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం గేదెలకు పాలు పీతకడం కోసం

     బావి దగ్గరకి వెళ్లగా అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కురిసిన వాన రావడంతో బావి వద్ద ఉన్న చెట్టుకిందకు వెళ్లి నిల్చున్నాడు. అదే సమయంలో పిడుగు పడడంతో కుమ్మరి మల్లేశం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కుమ్మరి మల్లేశం మృతితో కుకునూర్ పల్లి గ్రామంలో విషదఛాయలు అలుముకున్నాయి. 

Similar News