అప్పుల బాధ భరించలేక వ్యక్తి మృతి..

అప్పుల బాధ భరించలేక వ్యక్తి మృతి చెందిన సంఘటన

Update: 2024-04-14 13:14 GMT

దిశ,గూడూరు: అప్పుల బాధ భరించలేక వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది.. గూడూరు లోని చిట్యాల గడ్డ కు చెందిన బొంత వెంకటేష్ ( 35) హైదరాబాద్ లో ఇసుక వ్యాపారం చేస్తు అక్కడే కుటుంబం తో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు.ఇటీవల ఇసుక కాంట్రాక్టు కొనడం కోసం బయట అప్పులు చేసి వ్యాపారంలో తీవ్ర నష్టం రావడం వలన ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి తీవ్ర మనస్థాపానికి గురై ఈరోజు హైదరాబాద్ నుంచి తన స్వగ్రామమైన గూడూరు లోని తన ఇంటికి వచ్చి మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కి చీరతో ఉరి వేసుకుని చనిపోయాడు. మృతుడి తండ్రి బొంత రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గూడూరు ఎస్సై గణేష్ తెలిపారు. మృతునికి భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు.

Similar News