గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో వ్యక్తి మరణించిన సంఘటన హవేలీ ఘనపూర్ మండలం ముత్తాయి పల్లి గ్రామం గేటు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది.

Update: 2024-04-26 14:52 GMT

దిశ, మెదక్ టౌన్ : గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో వ్యక్తి మరణించిన సంఘటన హవేలీ ఘనపూర్ మండలం ముత్తాయి పల్లి గ్రామం గేటు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే హవేలీ ఘనపూర్ మండలం ముత్తాయి పల్లి గ్రామానికి చెందిన ఏగొండ (55) బైక్ పైన వెళ్తుండగా ముత్తాయిపల్లి గేటు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. వాహనం బలంగా

     ఢీ కొట్టడంతో ఏగొండ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని 108 అంబులెన్స్ లో మెదక్ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రోడ్ల పై వడ్లు ఆరపోయడం వలన రోడ్లు పైన వాహనాలు వెళ్లేందుకు ఇరుకుగా మారడంతో ప్రమాదం జరిగిందనీ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లుపైన వడ్లు సర్దన నుండి దాయర వరకు ఆరబోస్తున్నారని, అధికారులు ఈ విషయం పై ఎప్పుడు దృషి సారించక పోవడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు.  

Similar News