బావను దారుణంగా హత్య చేసిన బావమరిది

చేవెళ్ల మండలంలోని ఊరేళ్ళ గ్రామ సమీపంలో దారుణం చోటు చేసుకుంది.

Update: 2024-04-17 04:27 GMT

దిశ చేవెళ్ల: చేవెళ్ల మండలంలోని ఊరేళ్ళ గ్రామ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామ శీవారులో ఉన్న ఓ ఫామ్ హౌస్‌లో చేవెళ్ల గ్రామానికి చెందిన అంబేద్కర్రిస్ట్ కడమంచి నారాయణ దాస్ (46) అనే వ్యక్తి రాత్రి దారుణ హత్య గురయ్యాడు. పోలీసులు కథనం ప్రకారం చేవెళ్ల గ్రామానికి చెందిన మృతుడు నారాయణ దాస్‌కు వరుసకు బామ్మర్ది అయినా తూర్పటి భాస్కర్ గొడ్డలి‌తో నరికి హత్య చేశాడు. అనంతరం చేవెళ్ల పోలీస్ స్టేషన్ కు వెళ్లి తానే తన బావ అయినా నారాయణ దాస్‌ను హత్యచేసానని లొంగిపోయాడు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది అని సీఐ లక్ష్మారెడ్డి తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News