HYD: బ్లాక్‌లో IPL టికెట్లు అమ్ముతున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో ముంబై vs సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య కాసేపట్లో మ్యాచ్ జరుగనుంది.

Update: 2024-03-27 12:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో ముంబై vs సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య కాసేపట్లో మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం భారీగా మైదానం వద్దకు అభిమానులు చేరుకున్నారు. అయితే, టికెట్లు ఉన్న వారు నేరుగా స్టేడియం లోనికి వెళ్తుండగా.. కొందరు బ్లాక్‌ టికెట్లు కొని వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ దందాను గమనించిన పోలీసులు బ్లాక్‌లో టికెట్లు ముఠాను అదుపులోకి తీసుకున్నారు. స్టేడియం పరిసరాల్లో జోరుగా కాంప్లిమెంటరీ పాసుల విక్రయాలు జరుపుతుండగా.. వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఇవాళ రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Tags:    

Similar News