చెట్టును ఢీ కొట్టిన బైక్...వ్యక్తి మృతి

బైక్ ను అతివేగంగా నడిపి అదుపు చేయలేక చెట్టును ఢీ కొట్టి వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం చిట్యాల మండలంలోని జాతీయ రహదారి 65 పై పిట్టంపల్లి శివారులోని దశమి ల్యాబ్ కు వెళ్లే దారివద్ద జరిగింది.

Update: 2024-04-17 13:53 GMT

దిశ, చిట్యాల : బైక్ ను అతివేగంగా నడిపి అదుపు చేయలేక చెట్టును ఢీ కొట్టి వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం చిట్యాల మండలంలోని జాతీయ రహదారి 65 పై పిట్టంపల్లి శివారులోని దశమి ల్యాబ్ కు వెళ్లే దారివద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిట్యాల మండలం వీరేపల్లి గ్రామానికి చెందిన రూపని యాదయ్య (58) తన బంధువుల అంత్యక్రియలకని శివనేని గూడెం వెళ్లి తిరిగి తన స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా తన ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా నడిపి అదుపు చేయలేకపోవడంతో పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టాడు. దాంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైదాబాబు తెలిపారు. 


Similar News