10 కిలోల గంజాయి సీజ్​

స్థానిక పోలీసులు 10 కిలోల గంజాయి సీజ్​ చేశారు.

Update: 2024-04-28 13:20 GMT

దిశ, భద్రాచలం టౌన్ : స్థానిక పోలీసులు 10 కిలోల గంజాయి సీజ్​ చేశారు. కూనవరం చెక్ పోస్ట్ వద్ద ఎస్సై విజయ లక్ష్మి పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా తిరువూరుకు చెందిన సాంబయ్యపాలెం, శ్యామ్, యాకసిరి జగదీష్ కుమార్ అనే వ్యక్తులు బైక్ పైన గంజాయితో పారిపోవడానికి ప్రయత్నించారు. దాంతో వారిని పట్టుకుని బ్యాగులను తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్టు గుర్తించారు. నిందితులు నెల్లూరుకు చెందినవారుగా గుర్తించారు. జల్సాలకు అలవాటు పడి డబ్బులు సులువుగా సంపాదించాలని సీలేరు నుండి సుమారు 10 కిలోల 500 గ్రాముల గంజాయిని రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. వీరి నుంచి బైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారినీ రిమాండ్ కు తరలించారు. 

Similar News