సీఎం కీలక ప్రకటన.. 9,10,11 తరగతి విద్యార్థులంతా పాస్

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత విద్యా సంవత్సరంలో 9, 10, 11 తరగతుల విద్యార్థులకు పరీక్ష నిర్వహించకుండానే అందరినీ పాస్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రకటించారు. గురువారం తమిళనాడు అసెంబ్లీలో సీఎం పళనిస్వామి కీలక ప్రకటన చేశారు. ఎస్‌ఎస్‌ఎల్‌సి, ప్లస్ వన్ పరీక్షలను నిర్వహించడానికి పరిస్థితి అనుకూలంగా లేదని సూచించిన వైద్య నిపుణుల ఇన్‌పుట్‌ల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా గతేడాది మార్చిలో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. ఈ కారణంగా […]

Update: 2021-02-25 01:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత విద్యా సంవత్సరంలో 9, 10, 11 తరగతుల విద్యార్థులకు పరీక్ష నిర్వహించకుండానే అందరినీ పాస్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రకటించారు. గురువారం తమిళనాడు అసెంబ్లీలో సీఎం పళనిస్వామి కీలక ప్రకటన చేశారు. ఎస్‌ఎస్‌ఎల్‌సి, ప్లస్ వన్ పరీక్షలను నిర్వహించడానికి పరిస్థితి అనుకూలంగా లేదని సూచించిన వైద్య నిపుణుల ఇన్‌పుట్‌ల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా గతేడాది మార్చిలో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. ఈ కారణంగా పాఠశాలలను మూసివేశారు. విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాస్ నిర్వహించారు. కరోనా వ్యాప్తి, కర్ఫ్యూ కారణంగా గతేడాది తమిళనాడులో 10వ తరగతి పరీక్షలు రద్దు చేయబడ్డాయి. 11వ తరగతికి తప్పిపోయిన పరీక్షలు సైతం రద్దు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది 9, 10, 11 వ తరగతి విద్యార్థులు ఎలాంటి పరీక్షలు లేకుండా ఉత్తీర్ణత సాధిస్తారని సీఎం పళనిస్వామి వెల్లడించారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల పదవీకాలాన్ని 60 ఏళ్లు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

Tags:    

Similar News