చెరువులో మునిగి ఆ నలుగురు మృతి

దిశ, వెబ్‌డెస్క్: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మొగుల్‌మడక తండాలో విషాదం నెలకొంది. చెరువులో సరదాగా ఈతకెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. చెరువులో నీరు అధికంగా ఉండడంతో ఒడ్డుకు చేరే దారి కనబడలేదు. ఈ క్రమంలో నీటిలో మునిగి నలుగురు చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. మృతులు గణేష్, అర్జున్, అరుణ్, ప్రవీణ్‌గా గుర్తించారు. కాగా, మరో విద్యార్థి ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Update: 2020-11-20 11:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మొగుల్‌మడక తండాలో విషాదం నెలకొంది. చెరువులో సరదాగా ఈతకెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. చెరువులో నీరు అధికంగా ఉండడంతో ఒడ్డుకు చేరే దారి కనబడలేదు. ఈ క్రమంలో నీటిలో మునిగి నలుగురు చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. మృతులు గణేష్, అర్జున్, అరుణ్, ప్రవీణ్‌గా గుర్తించారు. కాగా, మరో విద్యార్థి ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News