మానకొండూర్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే నలుగురు దుర్మరణం

దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జ్యోతినగర్‌కు చెందిన నివాసులు ఖమ్మం జిల్లా కల్లూరులో జరిగిన దశదిన కర్మకు హాజరై తిరిగి వస్తుండగా.. శుక్రవారం తెల్లవారు జామున  మానకొండూరు పోలీస్ స్టేషన్ సమీపంలో కారు చెట్టుకు ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోవడంతో మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. చనిపోయిన వారిని డ్రైవర్ హిందూరి జలంధర్, […]

Update: 2021-11-25 21:45 GMT

దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జ్యోతినగర్‌కు చెందిన నివాసులు ఖమ్మం జిల్లా కల్లూరులో జరిగిన దశదిన కర్మకు హాజరై తిరిగి వస్తుండగా.. శుక్రవారం తెల్లవారు జామున మానకొండూరు పోలీస్ స్టేషన్ సమీపంలో కారు చెట్టుకు ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోవడంతో మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. చనిపోయిన వారిని డ్రైవర్ హిందూరి జలంధర్, కొప్పుల బాలాజీ శ్రీధర్, కొప్పుల శ్రీనివాస రావు, శ్రీరాజ్‌లుగా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన పెంచాల సుధాకర్ రావును కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిలో సిరిసిల్ల పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాసరావు, పెద్దపల్లిలో అడ్వకేట్‌గా పనిచేస్తున్న కొప్పుల బాలాజీ శ్రీధర్‌లు‌గా గుర్తించారు. వీరిద్దరు అన్నదమ్ములు కావడంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News