రక్తదానం చేసిన 200 మంది ఆటో డ్రైవర్లు

దిశ, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం మహా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరంలో సుమారు 200 మంది ఆటో డ్రైవర్లు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. ఒక్కసారి రక్తదానం చేస్తే ముగ్గురి ప్రాణాలను కాపాడొచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్, డీసీపీ ఎల్ఎస్ చౌహాన్, అడిషనల్ డీసీపీలు కరుణాకర్, భాస్కర్, ఏసీపీలు […]

Update: 2021-03-16 11:17 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం మహా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరంలో సుమారు 200 మంది ఆటో డ్రైవర్లు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. ఒక్కసారి రక్తదానం చేస్తే ముగ్గురి ప్రాణాలను కాపాడొచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్, డీసీపీ ఎల్ఎస్ చౌహాన్, అడిషనల్ డీసీపీలు కరుణాకర్, భాస్కర్, ఏసీపీలు బీఆర్ నాయక్, కేవీ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News