ఎల్‌వోసీ వెంబడి 16 ఉగ్ర స్థావరాలు

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో(పీవోకే)లోని నియంత్రణరేఖ(ఎల్‌వోసీ) వెంబడి 16 ఉగ్రస్థావరాలు పనిచేస్తున్నట్లు.. వీటిలో దాదాపు 300 మంది జైషే మొహమ్మద్, లష్కరే తొయిబా వంటి నిషేధిత సంస్థలకు చెందిన ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాదులకు పాక్ సైన్యం కూడా మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలోకి చొరబాట్లను నిరోధించేందుకు సైన్యం పకడ్బంధీగా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. గస్తీ నిర్వహించే భద్రతా సిబ్బంది కరోనా నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు […]

Update: 2020-04-26 20:11 GMT

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో(పీవోకే)లోని నియంత్రణరేఖ(ఎల్‌వోసీ) వెంబడి 16 ఉగ్రస్థావరాలు పనిచేస్తున్నట్లు.. వీటిలో దాదాపు 300 మంది జైషే మొహమ్మద్, లష్కరే తొయిబా వంటి నిషేధిత సంస్థలకు చెందిన ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాదులకు పాక్ సైన్యం కూడా మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలోకి చొరబాట్లను నిరోధించేందుకు సైన్యం పకడ్బంధీగా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. గస్తీ నిర్వహించే భద్రతా సిబ్బంది కరోనా నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. చొరబాటుదారులకు కరోనా ఉండే అవకాశం లేకపోలేదని దీంతో భద్రతా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు.

Tags: pok, loc, terrorists, Jaishe Mohammed, Lashkere Toiba

Tags:    

Similar News