- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పరకాల: తెలంగాణ ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరిగిన ‘బతుకమ్మ ఫిల్మోత్సవం 2021’ కార్యక్రమంలో భాగంగా ధర్మసాగర్లో కాళోజీ టివి ఆధ్వర్యంలో చిత్రీకరించిన “సుక్కాపొద్దు నిద్రలేసే తెలంగాణానే” పాటను ప్రదర్శించారు. చక్కని పాటను చిత్రీకరించినందుకు యాజమాన్యాన్ని సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస్ రాజ్, సంచాలకుడు మామిడి హరికృష్ణ అభినందించి దర్శకులు అమ్మ వేణుకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అమ్మ వేణు మాట్లాడుతూ ఇలాంటి ప్రోత్సాహకాలు కొత్తగా వచ్చే ఆర్టిస్టులను, సాంకేతిక నిపుణులు మరింత ఉత్సాహంతో ముందుకు రావడానికి ఆస్కారం ఉందని తెలిపారు. ఈ పాటకు లిరిక్స్ అందించిన గట్టు రాధికా మోహన్, మ్యూజిక్ నవీన్ సాంబరీ, సింగర్స్ పద్మావతి, లావణ్య, రాజేందర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story