ఉద్యమ ద్రోహులంతా కేసీఆర్ పక్కనే ఉన్నారు..

by  |
ఉద్యమ ద్రోహులంతా కేసీఆర్ పక్కనే ఉన్నారు..
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు 23 జిల్లాలో జరుగుతున్నాయని ఆ జిల్లాల్లో బీజేపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందని అన్నారు. అందుకే బీజేపీని గెలిస్తున్నారని అన్నారు.

టీఆర్ఎస్ పాలనపై నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారని, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఏవి ? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తప్పకుండా గెలుస్తారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు, మేధావులు అందరూ వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందన్న ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన నాయకులు ఎక్కడో ఉన్నారు, ఉద్యమ ద్రోహులు మాత్రం కేసీఆర్ పక్కన ఉన్నారని విమర్శలు చేశారు.


Next Story

Most Viewed