- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా కల్వచర్ల సమీపంలో హత్యకు గురైన హై కోర్టు అడ్వకేట్ దంపతులు గట్టు వామన్ రావు, పివి నాగమణీల హత్యలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. వీరిద్దరి హత్యకు రూ. 2 కోట్లు సుపారీ ఇచ్చినట్టు పోలీసు అధికారులకు ఓ లేఖ అందినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ లేఖలోని అంశాలపై అంతర్గతంగా విచారిస్తున్నట్టు సమాచారం. అయితే రూ.2 కోట్లు ఇచ్చిందెవరు, తీసుకున్నదెవరు అన్న వివరాలు కూడా అందులో పొందుపరిచినట్టు తెలిసింది. అయితే ఈ విషయాలన్నింటిపై పోలీస్ ఉన్నతాధికారులు సమగ్రంగా వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. రూ. 2 కోట్లు సుపారీ ఇచ్చిన వ్యక్తి నేరుగా ఇచ్చాడా అకౌంట్ ట్రాన్సఫర్ చేశారా? ఇందులో పోలీసుల పాత్ర ఎంతమేర ఉంది అన్న విషయాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం.
Next Story