- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : చాలా మంది క్రీడాకారులు తమ జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకునే వరకు వారి ఐడెంటిటీ ఎవరికీ పెద్దగా తెలియదు. ఒక్కసారి ఫేమస్ అయ్యాక వారి గతం బయటకు రివీల్ అయితే వారు ఎంతకష్టపడి ఈ స్థాయికి ఎదిగారు అనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరికొంత మంది షాక్కు గురవ్వడమే కాకుండా నోటి వెంట మాట రాలేదని వారు చెప్పే మాటలను వింటూనే ఉంటాం. అలాంటి ఘటనే ఒలింపిక్ విజేత మీరాబాయి చాను వ్యక్తిగత జీవితంలో తాను ఎలాంటి కష్టాలు అనుభవించి ఈ స్థాయికి చేరుకుందనే విషయాన్ని యాక్టర్ మాధవన్ ఒక ఫోటో ద్వారా అందరికీ తెలిసేలా చేశారు.
ఒలింపిక్స్లో కరణం మల్లీశ్వరి తర్వాత చాలా సంవత్సరాలకు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించి దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన అథ్లెట్ మీరాబాయి చాను వంట గదిలో కింద కూర్చుని భోజనం చేస్తున్న ఫోటోను నటుడు ఆర్ మాధవన్ రీట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మాధవన్ ‘‘హే ఇది నిజం కాదు. నేను పూర్తిగా పదాలు కోల్పోయాను.’’ అని రాసుకొచ్చారు. అయితే, రెండేళ్ల తర్వాత మణిపూర్లోని తన ఇంట్లో భోజనం చేస్తున్న ఫోటోను మీరాబాయి చాను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం అది కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. ఆ పిక్చర్ను చూసిన వాళ్లంతా మీరాబాయి తన పేదరికాన్ని సైతం జయించి ఒలింపిక్స్లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిందని ప్రశంసలు కురిపిస్తున్నారు.