- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, నర్సంపేట : రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లే ప్రధాన అంశంగా తెరకెక్కిన ‘రైతన్న’ సినిమాను ఆదరించాలని పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి కోరారు. వివరాల్లోకి వెళితే.. రైతన్న మూవీలో ప్రధాన పాత్రలో నటించిన ఆర్. నారాయణ మూర్తి బుధవారం నర్సంపేట పట్టణానికి చేరుకున్నారు. పట్టణంలోని ఎంసీపీఐయూ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ… రైతు సంక్షేమానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన చట్టాల రద్దే లక్ష్యంగా రైతన్న చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఇందులో రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానాంశంగా తీసుకున్నామన్నారు.ఇది మన సినిమా, ఈ నెల 13న విడుదలకు సిద్ధంగా ఉందన్నారు.దీనిని అందరూ ఆదరించి విజయవంతం చేయాలన్నారు.కార్యక్రమంలో ఎంసీపీఐయూ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ గాధ గోని రవి, వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి పెద్దారపు రమేష్, డివిజన్ కార్యదర్శి కన్నం వెంకన్న, మహిళా సంఘం ఏఐఎఫ్డీడబ్ల్యూ వరంగల్ జిల్లా కార్యదర్శి వంగల రాగసుధ, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
పెద్దిని కలిసిన పీపుల్స్ స్టార్..
నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి బుధవారం కలిశారు. ఈ సినిమాను ఆదరించాలని సినీ నటుడు, దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు.