- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణ శివారులో గల జెఏంజె పాఠశాలలోని విద్యార్థులకు సరైన ఆహారం అందించడం లేదు. అపరిశుభ్ర, నాసిరకమైన వంట సరుకులతో చేసిన ఉడికి ఉడకని, కుళ్లిపోయిన భోజనం పెట్టడం పట్ల విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గురువారం పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ఈ హాస్టల్లో నాసిరకం బియ్యంతో అన్నం పెడుతున్నారని, వంట గది, పాత్రలు దుర్గంధ భరితంగా ఉన్నాయన్నారు.
తమ చేత బలవంతంగా వంట పాత్రలు, మరుగుదొడ్లు, బండలు కడిగించడం, గదులను శుభ్రం చేయించడం, కూరగాయలు కట్ చేయడం వంటి పనులు చేయిస్తున్నారని వాపోయారు. ఇదేమిటని అడిగితే పాఠశాల నుంచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని విద్యార్థులు నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై పాఠశాల సిబ్బందిని ప్రశ్నించగా మాకు బియ్యం సరఫరా చేసిన వ్యాపారిదే బాధ్యతని తప్పించుకునే ప్రయత్నం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని వారు తెలపడంతో విద్యార్థులు ఆందోళన ముగించారు.