Breaking: తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

by Anukaran |   ( Updated:2021-12-07 20:18:40.0  )
road accident
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్టణంలోని తెలుగు తల్లి ఫైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వచ్చిన ఓ బైకు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తోన్న యువతి, యువకుడు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని మృతులు ప్రశాంత్(22), రాధిక(17)లుగా గుర్తించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.

Next Story