రన్నింగ్ ట్రైన్‌ నుంచి కిందపడ్డ యువకుడు.. తీవ్రగాయాలతో..!

by  |
రన్నింగ్ ట్రైన్‌ నుంచి కిందపడ్డ యువకుడు.. తీవ్రగాయాలతో..!
X

దిశ, పెద్దపల్లి: రన్నింగ్‌లో ఉన్న ట్రైన్ నుంచి కిందపడిపోయాడో యువకుడు. ఈ ఘటన ఓదెల పొలిమేర తారకరామకాలనీ గేట్ నెంబర్ 32 వద్ద జరిగింది. న్యూఢిల్లీ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్తున్న గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ ఓదెలకు చేరుకోగానే ఈ సంఘటన జరిగింది. రైలులో ప్రయాణిస్తున్న కృష్ణ చత్రి అనే యువకుడు ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఇది గమనించిన ఓ రైతు యువకుడి పరిస్థితిపై అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రుడిని ముందుగా పెద్దపల్లి ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. సదరు ప్రయాణికుడికి తల, నడుము భాగంలో తీవ్రగాయాలు అయినట్టు వైద్యులు ధృవీకరించడంతో.. మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.


Next Story