భార్యను కాపురానికి పంపాలని సెల్ టవరెక్కిన వ్యక్తి

by  |
భార్యను కాపురానికి పంపాలని సెల్ టవరెక్కిన వ్యక్తి
X

దిశ, వెబ్‌డెస్క్: తన భార్యను కాపురానికి పంపాలని సంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కాడు. నాగల్‌గిద్ద మండలం కరసగుత్తికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తికి కొన్నాళ్ల క్రితం వివాహం అయ్యింది. కొద్దిరోజుల పాటు సాఫీగా సాగిన సంసారంలో గొడవలు రావడంతో ఆ మహిళ తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో అత్తగారింటికి వెళ్లిన లక్ష్మణ్ తన భార్యను పంపించాలని కోరడంతో వారు తిరస్కరించారు. దీంతో మనస్తాపానికి గురైన లక్ష్మణ్ తన భార్యను కాపురానికి పంపాలని డిమాండ్ చేస్తూ సెల్ టవర్ ఎక్కాడు. తన భార్యను పంపిస్తామని హామీ ఇస్తేనే టవర్ దిగి వస్తానని చెబుతుండటంతో పోలీసులు అక్కడికి చేరుకొని సర్ది చెబుతున్నారు. తన భార్య వేరే వ్యక్తితో సహజీవనం చేస్తుండటం వల్లే కాపురానికి రావట్లేదని లక్ష్మణ్ ఆరోపిస్తున్నాడు.

Next Story

Most Viewed