నిద్రిస్తుండగా దొంగదెబ్బ తీసే ప్రయత్నం... సురక్షితంగా బయటపడిన పౌరులు

by srinivas |   ( Updated:2025-05-10 02:54:56.0  )
నిద్రిస్తుండగా దొంగదెబ్బ తీసే ప్రయత్నం... సురక్షితంగా బయటపడిన  పౌరులు
X

దిశ, వెబ్ డెస్క్: భారత సరిహద్దులో లో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజస్థాన్, పంజాబ్, జమ్మూకాశ్మీర్‌(Jammu Kashmir)లో పౌరులే టార్గెట్‌గా పాకిస్థాన్(Pakistan) ప్రక్షేపకాలు, డ్రోన్లతో రాత్రి సమయంలో బాంబు దాడులకు దిగుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు ధ్వంసం అవుతున్నాయి. ఆకాశ మార్గం ద్వారా జమ్మూ జిల్లా బిష్నా, రాజస్థాన్‌లోని బార్మర్‌ ప్రాంతంలో అనుమానిత ప్రక్షేపకాలు పడింది. దీంతో బలగాలు అప్రమత్తమయ్యాయి. ప్రక్షేపకాలు పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రక్షేపకాలు ఎటువైపు నుంచి వచ్చింది. ఎవరు పంపారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు పౌరులే లక్ష్యంగా పాక్ దుశ్చర్యలకు పాల్పడింది. జమ్మూ, శ్రీనగర్‌లో రాత్రి సమయంలో ఇళ్లపై దాడులకు దిగింది. ఈ దాడుల్లో పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఉరి ప్రాంతంలో ఓ ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. తాము ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం వచ్చింది. బయటకు వచ్చి చూడటంతో ఇళ్లకు రంధ్రాలు, కిటకీలు ధ్వంసం అయి ఉన్నాయని పౌరులు అంటున్నారు. ఈ దాడుల నుంచి సురక్షితంగా బయటపడ్డామని చెప్పారు.

Read More :

ఆప్ శంభు ఆలయంపై పాక్ మిస్సైల్ ఎటాక్.. నిర్వీర్యం చేసిన భారత సేనలు



Next Story

Most Viewed