- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సరిహద్దు డ్యామ్ గేట్లు ఓపెన్.. పాక్లో భయం భయం..!

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కాశ్మీర్(Jammu Kashmir)లో శుక్రవారం భారీగా వర్షం(Heavy Rain) కురిసిన విషయం తెలిసిందే. అయితే పలు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు సైతం జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు సలాల్, బాగ్లీహార్ డ్యామ్(Baglihar Hydroelectric Power Project Dam)కు భారీగా వరద నీరు చేరుతోంది. డ్యామ్ సామర్థ్యానికి మించి వరద నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు డ్యామ్ గేట్లు ఎత్తి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఈ నీటిని విడుదల చేయడాన్ని దాడుల్లో భాగంగా భారత్ ఈ చర్యకు దిగిందని పాకిస్థాన్ భావిస్తోంది. ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా వరదల ద్వారా తమపై దాడి చేస్తోందని ఆరోపిస్తోంది. కానీ వరదల కారణంగా నీటిని కిందకు విడుదల చేయాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఉగ్ర, పాక్ దాడులను ధైర్యంగా ఎదుర్కొంటామే తప్ప డొంకతిరుగుడు ప్రయత్నాలు తాము చేయమని అంటున్నారు.
ఇదిలా ఉంటే భారత్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగాయి. పహల్లాం దాడికి పత్రీకార చర్యను పాకిస్థాన్ సైన్యం తట్టుకోలేకపోయింది. పంజాబ్, గుజరాత్, జమ్మూకాశ్మీర్, ఛండీఘర్ ప్రాంతాన్ని టార్గెట్ చేసింది. డ్రోన్ల ద్వారా విధ్వంసం సృష్టించాలనే దుష్ట ప్రయత్నం చేస్తోంది. అయితే భారత జవాన్లు అందుకు దీటుగా సమాధానం చెబుతున్నారు. ఈ చర్యను జీర్ణించుకోలేకనే చీనాబ్ నది(Chenab River) వరద నీటి ద్వారా తమపై దాడి చేస్తున్నారనే ప్రచారానికి పాకిస్థాన్ తెరతీసినట్లు తెలుస్తోంది.