భారత్ ఎదురుదాడి..రోడ్లపైకి వచ్చి కేకలు పెడుతున్న పాకిస్తాన్ ప్రజలు

by Veldandi saikiran |   ( Updated:2025-05-09 23:45:50.0  )
భారత్ ఎదురుదాడి..రోడ్లపైకి వచ్చి కేకలు పెడుతున్న పాకిస్తాన్ ప్రజలు
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ కు ( pakisthan) ఇండియన్ ఆర్మీ ( Army) చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్ వదిలిన డ్రోన్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఇండియా... ఇప్పుడు పాకిస్థాన్ లోని ఎయిర్ బేస్ లపై ( Air Base) దాడులు చేస్తోంది. ఇప్పటికే మూడు ఎయిర్ బేస్ లను టార్గెట్ చేసి ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది.

ఇవాళ ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం అందుతుంది. ఇక పాకిస్తాన్ పై ఇండియా దాడి చేస్తున్న నేపథ్యంలో... అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అర్ధరాత్రి బాంబు దాడులకు... రోడ్లెక్కారు. ముఖ్యంగా పాకిస్థాన్ లోని ఒకార అనే ప్రాంతంలో... భారీ శబ్దాలు వచ్చాయి. దీంతో వెంటనే... రోడ్లపైకి వచ్చి జనాలు గుమిగూడారు. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని, బతుకుతున్నారు. ఇక మరో గంటలో మరో ఎయిర్ బేస్ పై దాడి చేయబోతున్నట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించినట్లు తెలుస్తోంది.




Next Story

Most Viewed