- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పాకిస్తాన్ డ్రోన్ దాడులు విఫలం.. జమ్మూకు బయలుదేరిన సీఎం ఒమర్ అబ్దుల్లా

దిశ, వెబ్ డెస్క్: భారత ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడి చేసి దాదాపు 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆర్మీ డ్రోన్లు, మిస్సైల్లతో విరుచుకుపడింది. ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలో పాక్ ఆర్మీ ఈ దాడులు చేసింది. దీంతో ముందస్తుగానే ఆర్మీ, స్థానిక పోలీసులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా రాత్రి మొత్తం ఈ దాడులు కొనసాగగా.. భారత ఆర్మీ దీటుగా ఎదురుకొవడమే కాకుండా.. దీటైన సమాధానం ఇచ్చింది. కాగా నిన్న రాత్రి పాకిస్తాన్ డ్రోన్ దాడి విఫలమైన తర్వాత పరిస్థితిని సమీక్షించడానికి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శుక్రవారం తెల్లవారుజామున జమ్మూకు బయలుదేరారు. "జమ్మూ నగరం డివిజన్లోని ఇతర ప్రాంతాలపై నిన్న రాత్రి విఫలమైన పాకిస్తాన్ డ్రోన్ దాడి తర్వాత పరిస్థితిని అంచనా వేయడానికి ఇప్పుడే జమ్మూకు వెళ్తున్నాను" అని సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్ (Twitter)లో ఒక పోస్ట్ చేశారు.