- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భారత భూభాగంలోకి దూసుకొచ్చిన యుద్ధ విమానాలు.. కూల్చేసిన భారత ఆర్మీ

దిశ, వెబ్ డెస్క్: భారత్, పాకిస్తాన్ మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. గురువారం రాత్రి పాక్ దాడికి దిగడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ముఖ్యంగా పాకిస్తాన్ బోర్డర్ లోని కీలక ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని డ్రోన్లు, మిస్సైల్స్ (Drones, missiles)తో దాడికి దిగింది. ఈ దాడిని భారత ఆర్మీ సమర్ధవంతంగా తిప్పికొట్టింది. కాగా శనివారం తెల్లవారుజామున పాక్ యుద్ధ విమానాలు (Pak fighter jets) భారత భూభాగంలోకి దూసుకొచ్చాయి. దీంతో అప్రమత్తమైన భారత రక్షణ వ్యవస్థ (Indian Defense System) వాటిని వెంటాడి మరి కూల్చివేసింది. ఈ దాడిలో పాక్ యుద్ధ విమానాల (Pak fighter jets) నుంచి ఇద్దరు పైలట్లు (Two pilots) శ్రీనగర్ ప్రాంతంలో ల్యాండ్ అయ్యారు. దీంతో వారి కోసం భారత బలగాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. కాగా భారత ఎయిర్ బేస్ ను లక్ష్యంగా చేసుకున్న పాకిస్తాన్.. యుద్ధ విమానాలతో ఎల్ఓసీని దాటి రావడంతో.. భారత ఆర్మీ (Indian Army) అప్రమత్తమై వాటిని కూల్చివేయడంతో ప్రమాదం తప్పింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also..పాకిస్థాన్ వక్ర చర్యలను తిప్పికొట్టిన భారత్.. పొలంలో డ్రోన్ శకలాలు కలకలం