భారత్, పాకిస్తాన్‌ సంయమనం పాటించాలి.. G7 దేశాల రిక్వెస్ట్

by Mahesh |   ( Updated:2025-05-10 03:03:58.0  )
భారత్, పాకిస్తాన్‌ సంయమనం పాటించాలి.. G7 దేశాల రిక్వెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: కశ్మీర్‌లో పర్యాటకుల దాడి తర్వాత భారత్ పాక్ లోని ఉగ్రవాదుల శిబిరాలపై దాడి చేసి 100 మందిని హతమార్చింది. ఈ దాడికి ప్రతీకారంగా గురు, శుక్రవారాల్లో పాక్ ఆర్మీ భారత్ పై దాడులకు పాల్పడింది. దీంతో రంగంలోకి దిగిన భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ పై విరుచుకు పడుతున్నాయి. పాకిస్తాన్ దాడులను విజయవంతంగా తిప్పికొడుతూ పాక్ పై భారత ఆర్మీ మెరుపు దాడులు చేస్తుంది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఇదంతా గమనిస్తున్న G7 దేశాలు (G7 countries) శనివారం స్పందించాయి. భారత్, పాకిస్తాన్‌లు సంయమనం (India and Pakistan should exercise restraint) పాటించాలి కోరాయి.

అలాగే ఇరు దేశాల మధ్య మరింత సైనిక చర్యల పెరుగుదల ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. ఇరు దేశాల పౌరుల భద్రత కోసం మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాము. ఈ ఉద్రిక్తతను వెంటనే తగ్గించాలని, శాంతియుత ఫలితం కోసం భారత్, పాకిస్తాన్ ప్రత్యక్ష సంభాషణలో పాల్గొనమని మేము పిలుపునిస్తున్నామని, మేము సంఘటనలను నిశితంగా పర్యవేక్షిస్తూ ఉన్నామని, వేగవంతమైన, శాశ్వత దౌత్యపరమైన పరిష్కారానికి (Permanent diplomatic solution) మా మద్దతును తెలియజేస్తున్నామని G7 దేశాలు (G7 countries) పిలుపునిచ్చాయి.

నిద్రిస్తుండగా దొంగదెబ్బ తీసే ప్రయత్నం... సురక్షితంగా బయటపడిన పౌరులు

ఆప్ శంభు ఆలయంపై పాక్ మిస్సైల్ ఎటాక్.. నిర్వీర్యం చేసిన భారత సేనలు



Next Story

Most Viewed