- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
హైఅలర్ట్.. జలంధర్లో బ్లాక్ అవుట్ విధింపు

దిశ, వెబ్ డెస్క్: భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం (India-Pakistan war) కొనసాగుతూనే ఉంది. భారత్లోని సరిహద్దు ప్రాంతాలే లక్ష్యంగా పాకిస్థాన్ డ్రోన్ (Drone attack) దాడులకు పాల్పడుతోంది. ఈ దాడులను భారత సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. అయితే, పంజాబ్లోని జలంధర్లో (Jalandhar) డ్రోన్లు కనిపించటంతో అధికారులు శనివారం బ్లాక్ అవుట్ (Black out) విధించారు. అనంతరం భద్రతా బలగాలు ఎక్కడిక్కడ తనిఖీలు చేపట్టారు. ప్రజలు శాంతంగా ఉండి, బ్లాక్ అవుట్ నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. అలాగే, భద్రతా చర్యగా, పాకిస్థాన్కు సమీపంగా ఉన్న గుజరాత్లోని పాటణ్ జిల్లాలోని సంతల్పూర్ తాలూకా గ్రామాల్లో బ్లాక్ఔట్ అమలు చేస్తున్నారు. ఇటు జమ్మూ కాశ్మీర్లోని అఖ్నూర్ ప్రాంతంలో పూర్తిస్థాయి బ్లాక్అవుట్ విధించారు. ఈ సమయంలో పేలుళ్లు, సైరన్లు వినిపించాయి. ప్రజలు నకిలీ వార్తలను నమ్మకూడదని తెలిపారు.
కాగా, శుక్రవారం అర్ధరాత్రి సరిహద్దు ప్రాంతాల్లో, నియంత్రణ రేఖ (LoC) వెంట ఉత్తరాన బారాముల్లా నుంచి దక్షిణాన భుజ్ వరకు 26 ప్రాంతాల్లో డ్రోన్లు కనిపించాయి. వీటిని భారత సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంది. ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత సాయుధ దళాలు ప్రతిక్షణం హైఅలర్ట్లో ఉన్నాయి. ప్రతీ ఏరియల్ ముప్పును కౌంటర్-డ్రోన్ సిస్టమ్ల ద్వారా గుర్తించి ఎదుర్కొంటున్నాయి. ప్రజలు, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల వారు, ఇళ్లలోనే ఉండాలని, అవసరం లేని సంచారాన్ని నివారించాలని అధికారులు సూచిస్తున్నారు.