- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ద్విచక్ర వాహన దొంగలు అరెస్ట్
దిశ, పేట్ బషీరాబాద్: ద్విచక్ర వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి జిల్లా జంగంపల్లి కి చెందిన గోగుల దేవ సహాయం (27), మెదక్ జిల్లా కౌడిపల్లి మండలానికి చెందిన రెడ్డి రమేష్ (27) లు ఓ కల్లు దుకాణంలో పరిచయమయ్యారు. మీరు జల్సాలకు అలవాటు పటేల్ పని చేస్తే వచ్చే డబ్బులు సరిపోక పోవడం తో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేయడం అలవాటుగా చేసుకున్నారు. దీంతో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 8, సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి చొప్పున మొత్తం 17 మోటార్ సైకిల్ ను దొంగతనం చేశారు.
ఈ మేరకు ఆయా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యాయి. విచారణ చేపట్టిన జీడిమెట్ల పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి దొంగతనం చేసిన వాహనాలను తనకా పెట్టుకునే డబ్బులు ఇచ్చి సహకరించిన మరో వ్యక్తిని అయితే అరెస్ట్ చేశారు. వివిధ ప్రాంతాలలో వాహనాలను దొంగతనం చేసి షాపూర్ నగర్ కళావతి నగర్ లో ఉండే మన్నే రాజు (35) దగ్గర తనకపెట్టేవారు. మన్నె రాజు మరో బైక్ మెకానిక్ అయిన శివకుమార్ కు ఈ వాహనాలను తిరిగి తనకా పెట్టేవాడు. కాగా ప్రధాన నిధులు ఇద్దరితో పాటు మన్నె రాజును అరెస్ట్ చేయగా శివ కుమార్ గౌడ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.