దారుణం..మాజీ ఎమ్మెల్యే కూతురిపై ఐదేళ్లుగా అత్యాచారం

by Disha Web Desk 18 |
దారుణం..మాజీ ఎమ్మెల్యే కూతురిపై ఐదేళ్లుగా అత్యాచారం
X

దిశ,వెబ్‌డెస్క్: మాజీ ఎమ్మెల్యే కూతురిపై ఐదేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డ ఘటన UPలో వెలుగు చూసింది. మొరాదాబాద్ జిల్లాకు చెందిన బాధితురాలి తండ్రి గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అతని పార్టీకి చెందిన నిందితుడు ఆసిఫ్ బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు. ఆమె అశ్లీల ఫొటోలు తీసి..వాటితో ఆమెను బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. రూ.6 కోట్ల వరకు వసూలు చేశాడు. ఇటీవల డబ్బు కోసం యాసిడ్ దాడికి పాల్పడటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మే 6వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు బాధితురాలు తన సోదరి డ్రైవర్‌తో కలిసి బ్యాంకుకు వెళ్లినట్లు తెలిపింది. నిందితుడు ఎస్సీ నాయకుడు తన కొడుకుతో అక్కడికి వచ్చాడు. బ్యాంకు నుంచి బయటకు రాగానే నిందితుడు ఆమె ముఖంపై యాసిడ్ పోస్తానని బెదిరించాడు. ఈ సమయంలో తన కుమారుడు డ్రైవర్ కి రివాల్వర్ చూపుతున్నాడని ఆరోపించింది. తాను కేకలు వేయడంతో అక్కడికి జనాలు వచ్చారని దీంతో నిందితుడు పారిపోయాడని బాధితురాలు చెప్పింది.

Next Story