ఈతకు వెళ్లి బాలుడు మృతి

by Disha Web Desk 15 |
ఈతకు వెళ్లి బాలుడు మృతి
X

దిశ, మర్రిగూడ : నిన్న మొన్నటి వరకు జిల్లా కేంద్రంలో హాస్టల్లో ఉండి చదువుకున్న పిల్లాడు సెలవులకు ఇంటికి వచ్చి సరదాగా ఈతకు వెళ్లి నీట మునిగి చనిపోయిన సంఘటన మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివన్నగూడ రిజర్వాయర్ వద్ద బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్సై రంగారెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని అంతంపేట గ్రామానికి చెందిన మహమ్మద్ హుస్సేన్ , అస్మితల పెద్ద కుమారుడు మహమ్మద్ ఖలీల్ (16) నల్గొండ మైనార్టీ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.

పాఠశాలకు సెలవులు రావడంతో ఇంటికి వచ్చిన ఖలీల్ గ్రామంలో ఉన్న చాంద్ పాషా తో కలిసి సరదాగా బుధవారం సాయంత్రం శివన్న గూడెం రిజర్వాయర్ వద్దకు వెళ్లి ఈత కొడుతూ నీటిలో మునిగి ఖలీల్ మృతిచెందాడు. తోటి స్నేహితుడు చాంద్ పాషా ఇచ్చిన సమాచారంతో పెద్ద ఎత్తున రిజర్వాయర్ వద్దకు జనం చేరుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు ఈతగాళ్లతో వెతికించారు. రాత్రి కావడంతో శవం ఆచూకీ లభ్యం కాలేదు. సెలవులకు ఇంటికి వచ్చిన కుమారుడు ఒక్కరోజైనా ఇంటిపట్టున ఉండకుండా అనంత లోకాలకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రుల రోదన చూపరులను కంటతడి పెట్టించింది.



Next Story

Most Viewed