- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పెళ్లి బారాత్లో పేలిన టపాసులు.. ఆసీఫ్నగర్ పీఎస్లో వాహనాలు దగ్ధం
దిశ, కార్వాన్: పెళ్లి బారాత్లో టపాసులు కాలుస్తుండగా నిప్పు రవ్వలు పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన వాహనాలపై పడి మంటలు అంటుకొని కాలి బూడిదైన ఘటన ఆసీఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. గురువారం రాత్రి 10 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ పక్క గల్లీలో పెళ్లి బారాత్ వెళుతోంది. ఈ క్రమంలో యువకులు పేల్చిన టపాసుల నుంచి వచ్చి నిప్పురవ్వలు స్టేషన్ వెనుక వైపు ఉన్న సీజ్ చేసిన వాహనాలకు అంటుకుంది. ఈ ఘటనలో సీజ్ చేసిన సుమారు 50 వాహనాలు కాలి బూడిదయ్యాయని పోలీసులు తెలిపారు. మంటలు ఎక్కువగా వ్యాపించడంతో పక్కనే ఉన్న బిల్డింగ్కు కూడా అంటుకునే ప్రమాదం ఉండడంతో ఆ భవనంలో నివసిస్తున్న వారిని బయటికి తరలించారు. వెంటనే పోలీసులు ఫైరింజన్కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హానీ జరగనప్పటికీ సీజ్ చేసిన వాహనాలు కాలిపోవడంతో వాహనదారులు ఆందోళన చెందారు. అయితే, టపాసులు కాలుస్తుండగా నిప్పురవ్వలు పడ్డాయా, ఎవరైనా కవాలనే నిప్పు పెట్టారా అనే కోణంలో ఆసిఫ్నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తామని ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.