- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
ఓయో హోటల్ పైనుంచి దూకి యువకుడి అనుమానాస్పద మృతి
దిశ, శేరిలింగంపల్లి: ఓయో రూమ్ లోని ఆరో అంతస్తు నుంచి దూకి యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాకు చెందిన సాయి.. నగరంలో ఉంటూ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. ఇటీవల ప్రిలిమ్స్ పరీక్ష రాసి మెయిన్స్ కు సిద్ధం అవుతున్నాడు. ఆదివారం నలుగురు ఫ్రెండ్స్తో కలిసి మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఓయో రూంకి వచ్చాడు. అయితే రాత్రి ఓయో హోటల్ ఆరో అంతస్తు పై నుంచి దూకి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సాయి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యువకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.