ఓయో హోటల్ పైనుంచి దూకి యువకుడి అనుమానాస్పద మృతి

by Mahesh |
ఓయో హోటల్ పైనుంచి దూకి యువకుడి అనుమానాస్పద మృతి
X

దిశ, శేరిలింగంపల్లి: ఓయో రూమ్ లోని ఆరో అంతస్తు నుంచి దూకి యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాకు చెందిన సాయి.. నగరంలో ఉంటూ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. ఇటీవల ప్రిలిమ్స్ పరీక్ష రాసి మెయిన్స్ కు సిద్ధం అవుతున్నాడు. ఆదివారం నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఓయో రూంకి వచ్చాడు. అయితే రాత్రి ఓయో హోటల్ ఆరో అంతస్తు పై నుంచి దూకి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సాయి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యువకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed