కరెంట్ షాక్ తో తల్లీ కూతుళ్లు మృతి..!

by Kalyani |
కరెంట్ షాక్ తో తల్లీ కూతుళ్లు మృతి..!
X

దిశ,కరీంనగర్ రూరల్: కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తో తల్లీ కూతుళ్లు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన విద్యాధర్ బిందానికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య చింతకుంటలోని ఇటుక బట్టీలోనే ఉంటూ అక్కడే ఆమె కూతురు బాబీ బిందాని(18), కొడుకు దశరథ్ బిందానితో కలిసి ఉంటుంది. విద్యాధర్ చిన్న భార్యతో కలిసి వేరే ఇంట్లో ఉంటూ వేరే ఇటుక బట్టీలో పని చేస్తున్నాడు. కాగా, బుధవారం రాత్రి పనులకు వెళ్లి వచ్చిన బేని బిందాని ఇంట్లో నిద్రించగా ఉదయమే సమీపంలో ఉండే జగన్నాథ్ అనే వ్యక్తి పనికి పోయేందుకు నిద్రలేపేందుకు వెళ్లాడు.

తలుపు తట్టడంతో విద్యుత్ షాక్ రాగా వెంటనే కేకలు వేసి విద్యాధర్ కు సమాచారం ఇచ్చాడు. అకడికి చేరుకున్న విద్యాధర్ కరెంటు వైర్లు తొలగించి లోనికి వెళ్లి చూడగా అతని పెద్ద భార్య బేని బిందాని, కూతురు బాబి బిందాని విద్యుత్ షాక్ తో మృతి చెంది ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తపల్లి ఎస్ఐ సాంబమూర్తి తెలిపారు.

Next Story

Most Viewed