BREAKING: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

by Disha Web Desk 19 |
BREAKING: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. కొందరు పోలీసులు గాయపడ్డారు. బీజాపూర్ జిల్లా చోటేతుంగాలి అటవీ ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన స్థలం నండి భద్రతా దళాలు భారీగా మావోయిస్టుల ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed