కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

by Sridhar Babu |
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, కోటపల్లి : మండల పరిధిలోని జిన్నారం గ్రామంలో ఓ వ్యక్తి కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. ఎస్సై స్రవంతి తెలిపిన వివరాల ప్రకారం... జిన్నారం గ్రామానికి చెందిన బోయిని పాండు (36) తండ్రి అంజయ్య వృత్తి రీత్యా వ్యవసాయం చేసుకొని జీవనం కొనసాగించే వారు.

మంగళవారం మధ్యాహ్నం వారి ఇంట్లోనే చీరతో ఉరేసుకొని ఆత్మ హత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, పోలీస్ లకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి భార్య రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బుధవారం శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Next Story

Most Viewed